సద్గుణబాల డిఆర్ఎస్ నరేంద్ర ’’ సద్గుణబాల పక్షపత్రిక ‘‘ను 2014 జూన్ 14న ప్రారంభించారు. ఈ పత్రిక తక్కువ సమయంలోనే ఎక్కువమంది పాఠకులకు చేరువ అయింది.నరేంద్ర తన రచనా వ్యాసాంగానికి ఉద్యోగం అడ్డంకిగా ఉందని భావించి ఆయన ఆర్ఎస్ఎస్ ప్రచురణ విభాగం మేనేజర్ పదవికి రాజీనామా చేసి పూర్తి సమయం సద్గుణబాల పత్రిక బాధ్యతలు నిర్వహించారు. కానీ ఆ తర్వాత పత్రిక నిర్వహణ బాధ్యత ఆయనకు తలకు మించిన భారంగా మారింది అయినప్పటికి కష్టాలకు తలవంచక పత్రికను నడుపుతున్నారు. డిఆర్ఎస్.నరేంద్ర సంపాదకులుగా వెలువడుతున్న సద్గుణబాల పత్రిక నాలుగు సంవత్సరాలు పూర్తిచేసుకొని ఐదవ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా విశేష సంచిక విడుదల చేశారు. సంచిక పేరు ’’ ఈ దేహం - దేేశం కోసం‘‘ ఇందులో నరేంద్రమోదీ పనితీరు, కేంద్ర ప్రభుత్వ విధానాలు పొందిపరిచిన వ్యాసాలు ఉన్నాయి.